ప్రేమ జంట ఆత్మహత్య

12 Mar, 2015 22:54 IST|Sakshi
ప్రేమ జంట ఆత్మహత్య

చిత్తూరు(తిరుపతి): తిరుపతి పట్టణంలోని గోవిందరాజు గుడి సమీపంలో ఉన్న ఓ లాడ్జీలో ప్రేమ జంట గురువారం బలవన్మరణానికి పాల్పడింది. మృతులు దేవిశ్రీ(22), దుర్గారావు(25) పశ్చిమగోదావరి జిల్లా వాసులుగా గుర్తించారు. దుర్గారావుకు 8 నెలల క్రితం వేరే యువతితో ఇష్టంలేని వివాహమైంది. దేవిశ్రీ, దుర్గారావు గతంలో ప్రేమికులు. కాని పెద్దలు వారి ప్రేమను అంగీకరించకుండా దుర్గారావుకు వేరే యువతితో వివాహం జరిపించారు. ఈ క్రమంలో 4 రోజుల క్రితం వీరిద్దరూ ఇంటిని వదిలి తిరుపతిలో వివాహం చేసుకుని లాడ్జిలో దిగారు. లాడ్జి మేనేజరు గురువారం సాయంత్రం 4 గంటలకు రూం ఖాళీ చేయాలని కోరాడు. దుర్గారావు కూడా ఖాళీ చేస్తున్నానని చెప్పాడు. మేనే జర్ మళ్లీ వచ్చి చూసేసరికి ఇద్దరూ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మేనేజర్ సమాచారాన్ని తిరుపతి పోలీసులకు అందించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు