'సుష్మా ను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు'

23 Aug, 2013 17:43 IST|Sakshi
'సుష్మా ను విమర్శించే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదు'

హైదరాబాద్: బీజీపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదని ఆ పార్టీ నేత నాగం జనార్తనరెడ్డి  మండిపడ్డారు. తెలంగాణ బలిదానాలపై మాట్లాడిన వ్యక్తిని విమర్శించడం తగదని ఆయన పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ మద్దతు లేకపోయినా తెలంగాణ వస్తుందని నాగం తెలిపారు.
 
 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ మద్దతు లేకపోయినా తెలంగాణ వస్తుందని, బీజేపీ మద్దతు లేకపోతే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం సాధ్యం కాదన్నారు.  తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
 

మరిన్ని వార్తలు