ఇన్ఫార్మర్ నెపంతో హోంగార్డు హత్య

13 Sep, 2014 10:04 IST|Sakshi

విశాఖ : మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం పలకజీడిలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో  నరేష్ అనే హోంగార్డును నక్సల్స్ హతమార్చారు. మృతుడు తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం జంగాలతోట వాసి. హత్య అనంతరం మృతదేహాన్ని మావోయిస్టులు జంగాలతోటలో పడవేసి వెళ్లారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

 

మరిన్ని వార్తలు