రుణాలు చెల్లించకుంటే.. బంగారం వేలం | Sakshi
Sakshi News home page

రుణాలు చెల్లించకుంటే.. బంగారం వేలం

Published Sat, Sep 13 2014 10:13 AM

sbi issues notice to farmers

అనంతపురం: అనంతపురం జిల్లా నార్పల ఎస్బీఐ అధికారులు రైతులకు నోటీసులు జారీ చేశారు. బంగారంపై తీసుకున్న రుణాలను వెంటనే చెల్లించాలని సూచించారు.

రుణాలు చెల్లించకుంటే బంగారు నగలు వేలం వేస్తామని బ్యాంక్ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీ ప్రభుత్వం రైతుల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించినా, ఇంకా అమలు కాలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
Advertisement