'ఆత్మహత్య కాదు... చంపి ఉరేశారు'

2 Aug, 2015 18:48 IST|Sakshi

గుంటూరు: గుంటూరు జిల్లా నగరం మండలం బెల్లంవారిపాలెంలో శనివారం ఓ మహిళ ఆత్మహత్య చేసుకోగా... కట్టుకున్న భర్త, అత్తింటి వారే హత్య చేశారంటూ బాధితురాలి బంధువులు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. గ్రామానికి చెందిన జగదీష్ బీఎస్‌ఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. శనివారం జగదీష్ భార్య కట్టుపల్లి అరుణ మృతి చెందగా... ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే, అత్తింటి వారే అరుణను చంపి ఉరేశారని మృతురాలి సోదరుడు రామకృష్ణ ఆదివారం నగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాపట్ల డీఎస్పీ మహేశ్ ఆదివారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జగదీష్ కుటుంబ సభ్యులను విచారించారు.

మరిన్ని వార్తలు