కాంగ్రెస్పై ప్రజలు కోపంగా ఉన్నారు: జెడి శీలం

23 Nov, 2013 15:49 IST|Sakshi
కాంగ్రెస్పై ప్రజలు కోపంగా ఉన్నారు: జెడి శీలం

గుంటూరు: కాంగ్రెస్‌పై ప్రజలు కోపంగా ఉన్నారని  కేంద్ర మంత్రి జేడీ శీలం చెప్పారు. అయితే  ఎప్పటికైనా కాంగ్రెస్‌యే ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం(యూటీ) చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.

 హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేయాల్సిందేనని కేంద్రమంత్రి కావూరి సాంబశివరావుతోపాటు జేడీ శీలం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ను యూటీ చేయకుంటే రాష్ట్ర విభజనకు అంగీకరించేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకి స్పష్టం చేసినట్లు కూడా ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు