మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికార బీజేపీ హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టగా, ఈసారైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ ఆశిస్తోంది. అతిపెద్ద రాష్ట్రాల్లో ఎంపీ ఒకటి కావడంతో ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలు జరగనుండటంతో ఐదు రాష్ట్రాల ఎన్నికల్ని సెమీఫైనల్స్గా భావిస్తున్నాయి.
ఎంపీలోని 230 శాసనసభ స్థానాలకు ఈ నెల 25న ఎన్నికలు జరుగుతాయి. వచ్చే నెల 8న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీకి కాంగ్రెస్ గట్టిపోటీనిస్తోంది. శివరాజ్సింగ్ చౌహాన్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే వరుసగా మూడోసారి విజయాన్ని అందిస్తాయని ఆశిస్తోంది. కాంగ్రెస్ మాత్రం సాంప్రదాయ ఓటు బ్యాంక్తో పాటు ప్రజల్లో ఉండే ప్రభుత్వ వ్యతిరేకతను సానుకూలంగా మార్చుకుని అధికారంలో రావాలని భావిస్తోంది. పనిలోపనిగా బీజేపీ హయాంలో వచ్చిన అవినీతి ఆరోపణల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తోంది.
కాంగ్రెస్, బీజేపీల తరపున అగ్రనాయకులు ప్రచారం చేశారు. బీజేపీ తరపున ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. విమర్శలు, ఆరోపణలతో ప్రచారాన్ని హోరెత్తించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా పేరు ప్రచారంలో ఉంది. ఇరు పార్టీల్లోనూ సీనియర్ నేతల వారసులు ఎన్నికల బరిలో ఉన్నారు. చౌహాన్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 143, కాంగ్రెస్ 71 సీట్లు గెలుచుకున్నాయి. బీఎస్పీ ఏడు, భారతీయ జనశక్తి ఐదు స్థానాలు నెగ్గారు. తాజా ఎన్నికల్లో విజయం ఎవర్ని వరిస్తుందో చూడాలి.
హ్యాట్రిక్పై బీజేపీ గురి.. ఆశల పల్లకిలో కాంగ్రెస్
Published Sat, Nov 23 2013 3:45 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
Advertisement