తిరుపతి రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు

19 Nov, 2015 19:45 IST|Sakshi

తిరుపతి: భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో రవాణా వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది. అంజేరమ్మ కనుమ వద్ద గురువారం సాయంత్రం కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామైంది. అధికారులు కొండ చరియలను తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.

 

మరిన్ని వార్తలు