సికింద్రాబాద్-విశాఖ మధ్య ప్రీమియం రైలు

25 Nov, 2014 02:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-విశాఖ మధ్య ఏసీ ప్రీమియం రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. ఇది డిసెంబర్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మర్నాడు ఉదయం 9.05కు విశాఖ చేరుతుంది.

తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 9.10కి విశాఖలో బయల్దేరి మర్నాడు ఉదయం ఏడింటికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లిల్లో ఆగుతుంది.
 

మరిన్ని వార్తలు