ఆర్టీసీ బస్సు కింద పడి విద్యార్థి మృతి

11 Sep, 2015 20:23 IST|Sakshi

బస్సులోంచి జారిపడి ఓ ఇంటర్ విద్యార్థి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోట బస్‌స్టాండ్‌లో శుక్రవారం జరిగింది. నాయుడుపేట మండలానికి చెందిన ప్రభాకర్ (16) కోట విద్యానగర్ లోని ఎన్‌బీకేఆర్ కళాశాలలో జూనియర్ ఇంటర్ చదువుతున్నాడు.

ఊరు నుంచి కాలేజికి రోజూ ఆర్టీసీ బస్సులో వెళ్లి వస్తుంటాడు. రోజులాగే శుక్రవారం కాలేజి నుంచి ఇంటికి వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతో జారిపడ్డాడు. దీంతో బస్సు వెనక చక్రాలు అతని పై నుంచి పోవడంతో.. అక్కడికక్కడే మృతిచెందాడు.

మరిన్ని వార్తలు