కూల్‌ డ్రింక్‌లో విషం కలుపుకొని ఆత్మహత్యయత్నం

6 Jul, 2019 22:20 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : జిల్లాలోని సింహాచలంలో విషాదం చోటు చేసుకుంది. ఓ కుటంబంలోని దంపతులు, వారి కుమార్తె కూల్‌ డ్రింక్‌లో విషం కలుపుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. దీంతో వారిని చికిత్స కోసం స్థానిక కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. మార్గం మధ్యలో తండ్రి, కూతురు మృత్యువాతపడ్డారు. కాగా భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ కుంటుంబం ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని విజయనగరం జిల్లా రేవిడి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు.
 

మరిన్ని వార్తలు