విజయనగరం: విజయనగరం జిల్లా కురుపాం మండల కేంద్రంలోని ఒక ఇంట్లో ఆదివారం సాయంత్రం చోరీ జరిగింది. ఈ సంఘటనలో దొంగలు 2 తులాల బంగారం, 2 కేజీల వెండి, రూ. 30 వేలు నగదు అపహరించారు. వివరాలు...ఇంట్లో ఎవరూలేని సమయం చూసి దొంగలు చొరబడి దోపిడీకి పాల్పడ్డారు. అనంతరం కొంత సమయం తరువాత ఇంటికి చేరిన యజమానులు దొంగతనం జరిగిందని తెలిసి బోరుమన్నారు. అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.