టీటీడీ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు

5 Jan, 2014 00:38 IST|Sakshi

 ఏలూరు (ఆర్‌ఆర్ పేట), న్యూస్‌లైన్ : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధార్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ధర్మ ప్రచార పరిషత్ కార్యక్రమ అధికారి బీఎస్‌ఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ నెల 6న ఏలూరు సత్రంపాడు అంబికా మాత ఆలయంలో అమ్మనమంచి బలరామశాస్త్రి భక్తి విభావరి, 7 నుంచి 9 వరకు నరసాపురం వరాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో తల్లాప్రగడ రామకృష్ణ శాస్త్రి ఉపన్యాసాలు ఉంటాయన్నారు. 10న మహాలక్ష్మీ సామూహిక కుంకుమ పూజలు,నేమాని నాగలక్ష్మి భాగవతారిణి హరికథ కాలక్షేపం , 11న నల్లజర్ల మండలం ఘంటావారిగూడెం హరిజనవాడలోని శ్రీరామాలయంలో టి.మణి కుమారి భాగవతారిణి హరికథ, 13న లింగపాలెం మండలం కొత్తపల్లి రామాలయంలో ఆర్‌బీకే శ్రీనివాస్ ఆధ్వర్యంలో భక్తి సంగీత విభావరి, 14 నుంచి 16 వరకు పోడూరు మండలం కొమ్ముచిక్కాల రామాలయంలో వి.ప్రసాద్ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, 17న హరికథ నిర్వహిస్తారు.

 18న  బ్రాహ్మణగూడెం రామాలయంలో విఢూతి బాబూరావు బుర్రకథ, 20న ఏలూరు రామాలయంలో సంగీత విభావరి, 21 నుంచి 23 వరకు పెంటపాడు మండలం మాధవరం రామాలయంలో దూళిపాళ ప్రభాకర కృష్ణమూర్తి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, 25న పోణంగిలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో వై. శివలక్ష్మి బుర్రకథ ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 27న ఇరగవరం మండలం రేలంగి జెడ్పీహెచ్ స్కూల్‌లో పసుపులేటి నాగేశ్వరరావు ఆధ్యాత్మిక ఉపన్యాసం, 28 నుంచి 30 వరకూ కొయ్యలగూడెం మండలం గంగవరం రామాలయంలో వి.సూరపరాజు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, 31న బాలం సూర్యచంద్రరావు హరికథా కాలక్షేపం నిర్వహిస్తారన్నారు.

మరిన్ని వార్తలు