ఈనాటి ముఖ్యాంశాలు

19 Oct, 2019 20:13 IST|Sakshi

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి పేదలకు నకిలీ ఇళ్ల పట్టాలిచ్చిన గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై శనివారం కేసు నమోదైంది. కల్కి భగవాన్ అక్రమాస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సత్యవేడు ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కోనేటి ఆదిమూలం డిమాండ్‌ చేశారు. ప్రమాదవశాత్తూ నాగార్జున సాగర్‌ ఎడుమ కాల్వలో దూసుకుపోయిన స్కార్పియో వాహనాన్ని ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఎనిమిది గంటల పాటు శ్రమించి శనివారం మధ్యాహ్నం వెలికితీశారు. ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా శనివారం తెలంగాణ బంద్‌కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి మరిన్ని వార్తల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి.

మరిన్ని వార్తలు