బైక్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరి పరిస్థితి విషమం

14 Mar, 2016 15:14 IST|Sakshi

గుంటూరు జిల్లా వినుకొండ మండలం నడిగడ్డ వద్ద సోమవారం మధ్యాహ్నం బైక్‌పైకి లారీ దూసుకుపోయింది. ఈ ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నడిగడ్డ గ్రామానికి చెందిన పాలడుగు వెంకట సుబ్బారావు (47), పావుల కాశయ్య (35)లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వినుకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు