తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని రెడ్డివారిపాలెం వీధిలో భారతి(22) అనే యువతిపై కత్తితో దాడి జరిగింది. గుర్తు తెలియని దుండగుడు రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న యువతిపై దాడి చేసి ఆమె వద్దనున్న సెల్ఫోన్ లాక్కెళ్లాడు. ఈ ఘటనలో ఆమెకు గాయాలు అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.