మంత్రి కురసాలపై కేసు కొట్టివేత

5 Dec, 2019 19:45 IST|Sakshi

సాక్షి, తూర్పుగోదావరి: ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుపై ఎన్నికల సమయంలో నమోదైన కేసును గురువారం న్యాయస్థానం కొట్టివేసింది. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కరప పోలింగ్‌ కేంద్రంలోకి కన్నబాబు అక్రమంగా ప్రవేశించారని ఆయనపై అభియోగం వచ్చిన తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన విజయవాడ ప్రత్యేక న్యాయస్థానం.. కన్నబాబుపై ఆరోపణలకు రుజువులు లేవని తెలిపింది. అలాగే కేసును కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.

మరిన్ని వార్తలు