పానీపాట్లు

27 Feb, 2014 02:37 IST|Sakshi
పానీపాట్లు

 వేసవికి ముందే జనం దాహార్తితో అల్లాడిపోతున్నారు. మడకశిర మండలం నల్లనాయకనపల్లి గ్రామస్తుల నీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. గ్రామంలోని మంచినీటి పథకానికి సంబంధించిన బోరు మోటారు వారం క్రితం చెడిపోయింది.

మరో రెండు బోర్లు ఉన్నా వాటికి మోటార్లు అమర్చలేదు. దీంతో ప్రజలు శివారులోని వ్యవసాయ పొలాలు, సి.కొడిగేపల్లి గ్రామం నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామంలో 73 కుటుంబాలున్నాయి. 290 మంది నివసిస్తున్నారు. రోజంతా నీరు తెచ్చుకునేందుకే సరిపోతుందని స్థానికులు నవీన్‌కుమార్, ఎర్రప్ప, నరసింహప్ప, వెంకటరామిరెడ్డి, రామాంజనరెడ్డి వాపోయారు.      -, మడకశిర రూరల్

మరిన్ని వార్తలు