సాక్షి10వ వార్షికోత్సవం సందర్భంగా కేక్‌ కట్‌ చేసిన జగన్‌ 

24 Mar, 2018 10:43 IST|Sakshi
కేక్‌ కట్‌ చేస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

సాక్షి, గుంటూరు :  ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ’సాక్షి’ 10వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా కావూరు శివారులో కేక్‌ కట్‌ చేశారు. విలువలకు కట్టుబడి.. పాత్రికేయ ధర్మాన్ని నిబద్ధతతో కొనసాగిస్తున్న సాక్షికి.. పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవే నా శుభాభినందనలు అని ఆయన తెలిపారు. ఇందులో పార్టీ కార్యకర్తలు, ఫొటోగ్రాఫర్‌లు, అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర కావూరు శివారు నుంచి ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి కోమిటినేనివారిపాలెం, గంగన్నపాలెం, ఐర్లపాడు, అమీనాషాహెబ్‌ పాలెం, బాసిక్‌ పురం, కేశానుపల్లి మీదగా నర్సరావుపేట వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. 


మరిన్ని వార్తలు