హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్కు చెందిన అగ్రి కింగ్ ట్రాక్టర్స్ కంపెనీ తాజాగా 40-50 హెచ్పీ శ్రేణిలో ‘ఏకేటీ-54’, ‘ఏకేటీ-44’ అనే రెండు కొత్త ట్రాక్టర్స్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటిల్లో ఎపిసైక్లిక్ హబ్ రిడక్షన్, ఆయిల్ బ్రేక్స్, పవర్ స్టీరింగ్, 20 స్పీడ్ ట్రాన్స్మిషన్ వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వివిధ రకాల పంటలను పండించే రైతులను దృష్టిలో ఉంచుకొని ఈ ట్రాక్టర్లను రూపొందించామని అగ్రి కింగ్ ట్రాక్టర్స్ చైర్మన్ పి.కె. వర్మ పేర్కొన్నారు.