న్యూఢిల్లీ: ఎయిరిం డియా(ఏఐ) ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏకపక్షమని ఎయిర్ కార్పొరేషన్స్ ఎంప్లాయీస్ యూనియన్(ఏసీఈయూ) విమర్శించింది. ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఏఐను ప్రైవేటీకరించేదిలేదు, పునరుద్ధరణకు తగిన ప్రయత్నాలన్నీ చేస్తామంటూ ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణపై తాజా కథనాలు చూసి, యూనియన్ ఆశ్చర్యపోయింది. ఇదే నిజమైతే గత హామీలన్నింటికీ కేంద్రం తూట్లు పొడిచినట్లే’ అని ప్రకటన వివరించింది.