హైదరాబాద్‌లో అతిపెద్ద యూఎస్‌ కాన్సులేట్‌

7 Mar, 2020 06:25 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో యూఎస్‌ కాన్సులేట్‌ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో రానుంది. ముంబైలో ఉన్న దౌత్య కార్యాలయం కంటే ఇది భారీగా ఉంటుందని హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సుల్‌ జనరల్‌ జోయల్‌ రీఫ్‌మన్‌ వెల్లడించారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ శుక్రవారం ఏర్పాటు చేసిన సీఈవో ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు. గచ్చిబౌలిలో 18 నెలల్లో ఇది అందుబాటులోకి రానుందని చెప్పారు.

మరిన్ని వార్తలు