కొత్త బెంజ్‌ కారు లాంచ్‌

14 Mar, 2019 15:52 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లగ్జరీ కార్‌ మేకర్‌ మెర్సిడెస్‌-బెంజ్‌ కొత్త  కారును లాంచ్‌  చేసింది. ఏఎంజీ సీ 43  కూపే 2019 వెర్షన్‌న లగ్జరీ కారును  గురువారం ఆవిష్కరించింది.  దీని ధరను రూ. 75 లక్షలుగా ( ఎక్స్‌ షో రూం ) నిర్ణయించింది.

టూ డోర్‌ కూపే 3.0 లీటర్  వీ 6 టర్బో ఇంజీన్‌తో రూపొందించింది. ఇది 287 కిలోవాట్స్‌ శక్తి. 520  గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4.7 సెకన్లలోనే  100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది.  

ఔత్సాహిక యువ వాహన చోదకుల కోసం  మెర్సిడెస్‌ ఏఎంసీ  బ్రాండ్‌లో కొత్త  మోడల్‌ ప్రవేశపెట్టడం చాలా ఆనందంతంగా ఉందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ మార్టిన్ స్కువెంక్ చెప్పారు.

మరిన్ని వార్తలు