మన కరెన్సీ నోటుకు మన కాగితమే!

23 Mar, 2016 02:20 IST|Sakshi

సాక్షి,బెంగళూరు: మన కరెన్సీ నోటుకు అవసరమైన కాగితాన్ని ఇకపై మనమే తయారు చేసుకోనున్నాం. దీని వల్ల ప్రతి ఏడాది వేలాది కోట్ల విదేశీ మారక ద్రవ్యం మిగలనుంది. ఈమేరకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణా ప్రైవేట్ లిమిటెడ్ (బీఆర్‌బీఎన్‌ఎంఎల్) మైసూరులోని మేటగళ్లి ప్రాంతంలో 35 ఎకరాల విస్తీర్ణంలో కరెన్సీ ప్రింటింగ్‌కు ఉపయోగించే కాగిత తయారీ పరిశ్రమను మంగళవారం ప్రారంభించింది. ఏడాదికి 12వేల మెట్రిక్ టన్నుల కాగితం ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ పరిశ్రమ వల్ల ప్రతి ఏడాది రూ.1,280 కోట్ల విదేశీ మారకద్రవ్యం మిగులుతుందని బీఆర్‌బీఎన్‌ఎంఎల్ సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ జగన్మోహన్ తెలిపారు.

మరిన్ని వార్తలు