నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

29 Oct, 2015 16:06 IST|Sakshi

అమెరికా వడ్డీరేట్లపై ఫెడ్‌ రిజర్వ్‌ సమావేశమైన నేపద్యంలో గత మూడు రోజుల నుంచి భారతీయ స్టాక్‌మార్కెట్లలో ఆందోళన నెలకొంది. దీంతో స్టాక్‌ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లో ముగిసాయి. సెన్సెక్స్‌  201 పాయింట్ల నష్టంతో  26వేల 838 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 59పాయింట్ల నష్టంతో 8111 పాయింట్ల వద్ద ముగిసింది.

 

ఇక నిఫ్టీ టాప్‌ గేయినర్స్‌లిస్ట్‌లో  డాక్టర్‌ రెడ్డీస్‌2.22శాతం, యస్‌బ్యాంక్‌  2.25శాతం,విఇడిఎల్‌ 2.14శాతం, ల్యూపిన్‌ 0.87శాతం,అల్ట్రాటెక్‌ 0.84శాతంలాభపడ్డాయి. ఇక నిఫ్టీ టాప్‌ లూజర్స్‌లిస్ట్‌లో  బిహెచ్‌ఇఎల్‌  4.43శాతం , బిపిసిఎల్‌ 3.40శాతం, యాక్సెస్‌ బ్యాంక్‌ 3.12శాతం నష్టపోయాయి.

 

మరిన్ని వార్తలు