ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు లాభపడి 25,697.66 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఇక నిఫ్టీ 7800 మార్క్ దాటింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల నుంచి సానుకూల స్పందనతో దాని ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. మరోవైపు యూఎస్ డాలర్ విలువతో పోల్చితే రూపాయి 9 పైసలు లాభపడి మారకం విలువ 66.24గా ఉంది.