నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

8 Jul, 2015 10:05 IST|Sakshi
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

ముంబై: బుధవారం నాటి మార్కెట్లు  నష్టాలతో  ప్రారంభమయ్యాయి.  ప్రారంభ సెషన్లో 300 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ తరువాత స్వల్పంగా కోలుకుంది.  సెన్సెక్స్ 211 పాయింట్ల నష్టంతో 27,960 దగ్గర నిఫ్టీ  68పాయింట్ల  నఫ్టంతో 8,443 దగ్గర ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్ల్ భారీ పతనం మన మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. మార్కెట్ల పతనమైన అవకాశాన్ని స్వల్ప కొనుగోళ్లకు వినియోగించుకోవాలని ఎనలిస్టులు సూచిస్తున్నారు. మరోవైపు డాలర్తో పోలిస్తే రూపాయి 13 పాయింట్ల నష్టపోయి 63.59 దగ్గర ఉంది.

 

మరిన్ని వార్తలు