రూ.4,999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌

12 Jun, 2015 16:34 IST|Sakshi
రూ.4,999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల తయారీలో ఉన్న జెడ్‌టీఈ రూ.4,999లకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించింది. బ్లేడ్ క్యూలక్స్ పేరుతో తయారైన ఈ మోడల్ భారత్‌లో చవకైన 4జీ స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ దక్షిణాసియా టెర్మినల్ సేల్స్ సీఈవో యువాన్ కాంగ్ తెలిపారు. డేటా స్పీడ్ 150 ఎంబీపీఎస్ వరకు ఉంటుందని చెప్పారు. ఈ ఫోన్ జూన్ 16 నుంచి ప్రత్యేకంగా అమెజాన్‌లో లభిస్తుంది.

4.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే, 1.3 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, ఆటోఫోకస్ లెడ్ ఫ్లాష్‌తో 8 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ఇంటర్నల్ మెమరీ, 32 జీబీ ఎక్స్‌టర్నల్ మెమరీ, డ్యూయల్ సిమ్ వంటి ఫీచర్లున్నాయి. ఆన్‌డ్రాయిడ్ 4.4 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. వర్షన్ 5కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ నుంచి డబుల్ డేటా ఆఫర్ కూడా ఉంది.

మరిన్ని వార్తలు