ప్రేమజంట బలవన్మరణం

7 Feb, 2019 11:06 IST|Sakshi
ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట (ఫైల్‌)

టీ.నగర్‌: సుశీంద్రం సమీపంలో ప్రేమజంట మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. కన్యాకుమారి జిల్లా సుశీంద్రం సమీపం వళుక్కంపారైకి చెందిన శివకుమార్‌ శిల్పాల కళాకారుడు. ఇతని భార్య కళ. వీరి కుమార్తె ఆనంది (17), కుమారుడు అజిత్‌ (16). ఆనంది సుశీంద్రంలోని పాఠశాలలో ప్లస్‌టూ చదువుతోంది. వీరి బంధువు పెరియస్వామి (45)  కూడా మనవిలై ప్రాంతంలో నివశిస్తున్నాడు. ఇతని కుమారుడు అజిత్‌ (20) తొమ్మిదో తరగతి చదివి భవన నిర్మాణ పనులు చేçస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆనంది, అజిత్‌ల మధ్య పరిచయం ప్రేమగా మారింది. వీరి ప్రేమకు ఆనంది తల్లిదండ్రులు వ్యతిరేకించారు. దీంతో ఆనంది మంగళవారం అజిత్‌తో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రేమను వ్యతిరేకిస్తున్నారని, తనను మరిచిపొమ్మని వేడుకుంది. దీంతో అజిత్‌ ఆమెను విడిచిఉండలేనని, కలిసి బతకలేని తామిద్దరి ఆత్మహత్య చేసుకుందామన్నాడు.

అనంతరం విషపు గింజల పొడిని నీటిలో కలుపుకుని తాగి నేరుగా ఆనంది ఇంటికి వెళ్లాడు. తర్వాత విషపు నీటిని ఆనందికి అందజేయడంతో ఆమె కూడా తాగింది. కొద్ది సేపట్లో ఆనంది నోటి నుంచి నురగలు రావడంతో కుటుంబసభ్యులు   ఆచారిపల్లం ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆనంది మృతిచెందింది. అజిత్‌ సెంగట్టి వంతెన వద్ద స్పృహతప్పి పడిపోగా అతన్ని గమనించిన స్థానికులు ఇంటిలో సమాచారం తెలిపారు. దీంతో అజిత్‌ను తండ్రి బంధువులు మరుంగూరులోగల ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్సల కోసం మయిలాడి ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. దీనిపై సుశీంద్రం పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపారు. 

మరిన్ని వార్తలు