చాంద్రాయణగుట్ట: వివాహం చేయడం లేదని మనస్తాపానికి గురైన ఓ యువకుడు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై సాయి కుమార్ గౌడ్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.ఉత్తరప్రదేశ్కు చెందిన పాల్ దీపక్ కుమార్(27) మూడు నెలల క్రితం ఉప్పుగూడ శివాజీనగర్లో ఉంటున్న సోదరుడి వద్దకు వచ్చాడు. స్థానికంగా పీచు మిఠాయి విక్రయిస్తున్నాడు. తనకు పెళ్లి చేయాలని తరచూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మరి కొన్నాళ్లు ఆగాలంటూ కుటుంబ సభ్యులు వాయిదా వేస్తున్నారు. దీంతో గతంలో అతను ఒకసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా సోమవారం అతని సోదరుడు బయటికి వెళ్లగా....వదిన బయట పని చేస్తుండగా మధ్యాహ్నం గదిలోకి వెళ్లి టవల్తో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.