కర్మాగారంలో పేలుడు, ఏడుగురు మృతి

5 Jul, 2020 17:59 IST|Sakshi

సాక్షి, ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లోని ఓ కర్మాగారంలో పేలుడు సంభవించి ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. ఘజియాబాద్‌లోని మోదీ నగర్‌లో ఆదివారం ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు జిల్లా కలెక్టర్‌ అజయ్‌ శంకర్‌ పాండే తెలిపారు. మరోవైపు సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు