ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

30 Oct, 2019 14:37 IST|Sakshi

సాక్షి, బెంగుళూరు : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. పావగడ నుంచి కొరటగెరె వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు జెట్టి అగ్రహార వద్ద బోల్తా పడింది. బుధవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఏడుగురు మరణించగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక హాస్పిటల్స్‌ తరలించి చికిత్స అందిస్తున్నారు. బస్సులో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది.

మరిన్ని వార్తలు