కృష్ణా పుష్కరాల్లో అపశృతి చోటుచేసుకుంది. పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరించడానికి వచ్చిన మహిళకు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. ధరణికోట బుద్ధుని ఘాట్లో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ఎదుట వేసిన టెంట్ కూలిపోయింది. ఆ సమయంలో టెంట్ కింద ఉన్న సాయి నిఖిత అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు ఉన్న మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు వెంటనే వారిని వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.