గుంటూరు ఈస్ట్: వ్యక్తిని కర్రతో కొట్టి మృతికి కారణమైన నిందితుడిని లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. ఎస్హెచ్వో తిరుమలరావు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 24వ తేదీన ఎల్ఆర్కాలనీలో వివాహేతర సంబంధం నేపథ్యంలో సాంబశివరావుపై దాడి జరిగింది. సంఘటనలో గాయపడిన సాంబశివరావు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందిన సంఘటన తెలిసిందే. ఈసంఘటనలో సాంబశివరావును కర్రతో కొట్టి గాయపరిచి మృతికి కారణమైన ఎల్లాల రామారావును మంగళవారం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.