విశాఖ రైల్వే జోన్‌పై అఖిలపక్ష భేటీ

18 Apr, 2016 11:05 IST|Sakshi

విశాఖ: విశాఖ రైల్వే జోన్‌పై సోమవారం అఖిలపక్ష నాయకులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మున్సిపల్ కార్యాలయం వద్ద భేటీయ్యారు. ఈ సమావేశమానంతరం అఖిలపక్షం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనుంది. ఈ సమావేశానికి సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, ప్రజా న్యాయవాద సంఘాలు హజరయ్యారు. రైల్వే జోన్ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ భేటీలో నాయకులు చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు