సత్తెనపల్లి(గుంటూరు జిల్లా): భర్త వేధింపుల నుంచి తనను కాపాడాలంటూ సునీత(50) అనే మహిళ సత్తెనపల్లి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మాచర్లకు చెందిన సునీత, సత్తెనపల్లి పట్టణ ఏఎస్ఐ భాస్కర్లు భార్యాభర్తలు. వీరికి 35 ఏళ్ల క్రితం పెళ్లైర ది. దంపతులకు ముగ్గురు సంతానం.
అయితే కొన్ని రోజులుగా ఇంటికి రాకుండా, వేరొక యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వేధింపులకు గురిచేస్తున్నాడని అదే పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోంది.