వేధింపులపై కేసు నమోదు

22 Mar, 2017 00:07 IST|Sakshi

పామిడి : వితంతువు మంజులను వేధించిన కేసులో ఆమె అత్తింటివారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎస్‌ఐ రవిశంకర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. పావగడకు చెందిన మంజులను పామిడి టీచర్స్‌ కాలనీకి చెందిన మారుతీ ప్రసాద్‌తో వివాహమైంది. మారుతీప్రసాద్‌ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. తమ ఆస్తి తన కోడలికి చెందకూడదన్న ఉద్దేశంతో అత్త నాగరత్నమ్మ, ఆడపడుచు లలిత, మామ ఆదినారాయణ, మంజులను తరచూ వేధించేవారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు  వేధింపుల కేసు ( 498–ఏ) నమోదు చేశారు.

>
మరిన్ని వార్తలు