వర్ని : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలపై ఆదివారం కామారెడ్డిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చిన్న గంగాధర్ శుక్రవారం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించగానే కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారన్నారు. అయితే రెండేళ్లు గడుస్తున్నా హామీని నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశానికి జిల్లాలోని సభ్యులందరూ హాజరుకావాల్సిందిగా ఆయన కోరారు.