ఖమ్మం కలెక్టర్‌గా దానకిషోర్

26 Apr, 2016 23:38 IST|Sakshi

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ పీసీసీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో ముగ్గురు అధికారులను మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది.

ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా దానకిశోర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. జిల్లా ఎస్పీగా రమా రాజేశ్వరి, పాలేరు ఉప ఎన్నిక రిటర్నింగ్‌ అధికారిగా డిప్యూటీ కలెక్టర్‌ శంకర్‌ లను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

>
మరిన్ని వార్తలు