♦ ఫైల్పై సంతకం చేసిన కేసీఆర్
♦ వాటర్గ్రిడ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి
♦ అధికార భాషా సంఘం చైర్మన్గా దేవులపల్లి ప్రభాకర్రావు
♦ బుద్ధవనం ప్రాజెక్టు స్పెషలాఫీసర్గా మల్లెపల్లి లక్ష్మయ్య
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి ముందే నామినేటెడ్ పదవుల వడ్డన మొదలైంది. మార్కెట్ కమిటీలకు పాలకవర్గాల నియామకంతో పదవుల పంపిణీకి శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మంగళవారం మరో నలుగురికి కీలకమైన నామినేటెడ్ పదవులు కట్టబెట్టారు. తెలంగాణ ఆర్టీసీ చైర్మన్గా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణను నియమించారు. ఈ మేరకు ఫైల్పై సంతకం చేశారు.
అలాగే తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్ (మిషన్ భగీరథ) వైస్ చైర్మన్గా ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డిని నియమించి కేబినెట్ హోదా కల్పించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి సీఎంకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. అందుకే కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మిషన్ భగీరథ కార్పొరేషన్కు స్వయంగా సీఎం చైర్మన్గా ఉన్నారు. కొత్తగా నియమించిన వైస్ చైర్మన్ పదవీ కాలం మూడేళ్లు ఉంటుం దని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక ప్రముఖ రచయిత, జర్నలిస్టు దేవులపల్లి ప్రభాకర్రావును తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్గా నియమించారు. కేబినెట్ హోదాతో పాటు ఈ పదవీ కాలం ఏడాదిపాటు ఉంటుందని సాధారణ పరిపాలనా విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు బుద్ధవనం ప్రాజెక్టు స్పెషలాఫీసర్గా సీనియర్ జర్నలిస్టు, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ కో-ఆర్డినేటర్ మల్లేపల్లి లక్ష్మయ్యను నియమిస్తూ పర్యాటక సాంస్కృతిక యువజనాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్లో ప్రపంచవ్యాప్తంగా బౌద్ధులను ఆకర్షించేలా బౌద్ధవనం ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు స్పెషలాఫీసర్తో పాటు పాలకవర్గ కమిటీ ఏర్పాటు చేయనుంది. ప్రభుత్వంతో చర్చలు, సంప్రదింపులతో ఈ కమిటీని నియమించే బాధ్యతను మల్లేపల్లి లక్ష్మయ్యకు అప్పగించింది. తమకు బాధ్యతలు అప్పగించినందుకు ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి, ప్రభాకర్రావు సచివాలయం లో సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.
టీఎస్ఆర్టీసీ చైర్మన్గా సోమారపు
Published Tue, Apr 26 2016 11:14 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement