డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య కలకలం

22 Dec, 2016 11:39 IST|Sakshi

వరంగల్ అర్బన్: డిగ్రీ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. చైతన్య డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థి కృష్ణారెడ్డి వరంగల్ హైవే వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయే ముందు కృష్ణారెడ్డి నాణేలతో 'A' అక్షరాన్ని రాసినట్లు గుర్తించారు. విద్యార్థి మృతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇది హత్యా.. లేక ఆత్మహత్యా.. అని అన్నికోణాల్లోనూ విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు