అరుణ కుమారికి డాక్టరేట్‌

11 Aug, 2016 16:56 IST|Sakshi
ఏయూక్యాంపస్‌: ఆంధ్రవిశ్వవిద్యాలయం హిందీ విభాగ పరిశోధక విద్యార్థిని టి.అరుణ కుమారికి వర్సిటీ డాక్టరేట్‌ లభించింది. విభాగ ఆచార్యులు ఎన్‌. సత్యనారాయణ పర్యవేక్షణలో ‘ గోవింద్‌ మిశ్రా కి ఉపన్యాసన్‌ మే చిత్ర సామాజిక జీవన్‌’ అంశంపై జరిపిన పరిశోధనకు డాక్టరేట్‌ లభించింది. గురువారం ఉదయం వర్సిటీ ఉపకులపతి ఆచార్య జి.నాగేశ్వరరావు అరుణ కుమారికి ఈ మేరకు ఉత్తర్వులు అందజేసి అభినందించారు. గోవింద్‌ మిశ్రా నవలల్లో చిత్రించిన సామాజిక జీవనపు అంశాలను తన పరిశోధనలో వివరించారు. ఈ సందర్భంగా అరుణను విభాగ ఆచార్యులు, పరిశోధకులు అభినందించారు.
 
>
మరిన్ని వార్తలు