పరారయ్యాడు.. పట్టుబడ్డాడు

23 Sep, 2016 02:11 IST|Sakshi
బుట్టాయగూడెం: ఓ చోరీ కేసుకు సంబంధించి పోలీసులు పట్టుకున్న నిందితుడు పరారై మళ్లీ పోలీసులకు చిక్కిన సంఘటన బుట్టాయగూడెంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. మండలంలో విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లలో రాగి వైరు చోరీకి సంబంధించి ఇటీవల ఓ వ్యక్తిని బుట్టాయగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు గురువారం పోలీస్‌స్టేçÙన్‌లో కనిపించకుండా పోయాడు. దీంతో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు మరలా చిక్కడంతో అతడిని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు.  
 
మరిన్ని వార్తలు