నిజామాబాద్‌లో దొంగల ముఠా హల్‌చల్

4 Aug, 2016 15:39 IST|Sakshi

 నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినయాక్ నగర్ బస్వాగార్డెన్‌లో బుధవారం రాత్రి దొంగలు మల్‌చల్ చేశారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడటానికి వచ్చిన దొంగలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా.. ముఠాలోని కొందరు దొంగలు స్థానికుల పై దాడికి దిగారు. సుమారు 10 మంది మహారాష్ట్రకు చెందిన దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు విచారణ చేపడుతున్నారు. సీసీ టీవీల్లో రికార్డైన ఆధారాల ప్రకారం పోలీసులు వేట సాగిస్తున్నారు. పోలీసుల అదుపులో నలుగురు దొంగలు ఉన్నట్లు సమాచారం.

 

>
మరిన్ని వార్తలు