కరీంనగర్సిటీ : ఆట ఆహ్వానం మేరకు ఆమెరికాలో పర్యటించి స్వదేశానికి తిరిగి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమరాజేందర్రావు దంపతులకు జెడ్పీటీసీ, ఎంపీపీలు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్న చైర్పర్సన్ను శంషాబాద్ విమానాశ్రయంలో జెడ్పీటీసీలు తన్నీరు శరత్రావు, శేఖర్, ఎంపీపీ అయిలయ్య, తదితరులు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.