విద్యార్థులకు నోటుపుస్తకాలు, స్టేషనరీ పంపిణీ

19 Jul, 2016 22:37 IST|Sakshi
విద్యార్థులకు నోటుపుస్తకాలు, స్టేషనరీ పంపిణీ
హుజూర్‌నగర్‌ : పట్టణంలోని అంబేద్కర్‌నగర్‌ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం దళిత మహిళా సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు చెవుల కవిత 60 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు దాతల ప్రోత్సహకాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్‌పతినాయక్,  హెచ్‌ఎం భాస్కర్‌ రెడ్డి, ఉపాధ్యాయులు రామ్మూర్తి, నర్సింహారావు, సీహెచ్‌.రత్తయ్య, టీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాలు గోపు చెలీనమ్మ, భవాని, రమ్య, చంద్రకళ, విద్యార్థులు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు