'ఈ కేసులో అకారణంగా ఇరికించారు'

31 Dec, 2015 15:43 IST|Sakshi

విజయవాడ : కాల్మనీ కేసులో అకారణంగా తనను ఇరికించారని డీఈ సత్యానందం ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం విజయవాడలో డీఈ సత్యానందం మాట్లాడుతూ... తాను ఉద్యోగ సంఘం నేతగానే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇంటెలిజెన్స్ డీజీ ఏ బి వెంకటేశ్వరరావును కలిసినట్లు తెలిపారు. కాల్మనీ కేసులో ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ఈ సందర్భంగా డీఈ సత్యానందం స్పష్టం చేశారు.

>
మరిన్ని వార్తలు