ఎండిపోతున్న పంటపోలాలను పరిశీలించిన కొత్తపల్లి

16 Feb, 2016 19:32 IST|Sakshi

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురం తీర ప్రాంతంలో ఎండిపోతున్న పంటపోలాలను వైఎస్‌ఆర్‌సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు మంగళవారం పరిశీలించారు. పంటపోలాలకు సాగునీరు అందక బాధపడుతున్న రైతుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉండగా, నరసాపురం మండలం మెడి గ్రామంలో ఎండిన పంటపోలాలను చూసి ఇరిగేషన్ అధికారులపై రైతులు విరుచుకుపడ్డారు. పంటకాలంలో నీళ్లు అందకపోవడంతో పోలాలు ఎండిపోతున్నాయంటూ వాపోయారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లాలోని దత్తత గ్రామమైన పేరుపాలెంలో ఈ నెల 22న కాంగ్రెస్‌ నేత చిరంజీవి పర్యటించనున్నారు.

మరిన్ని వార్తలు