విజయనగరం:
మితి మీరిన వేగంతో వెళ్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన పట్టణంలోని ఎస్.వి.ఎన్. లేక్ ప్యాలెస్ ఎదురుగా శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఇది గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.