బిడ్డతో సహా తల్లి ఆత్మహత్య

28 Jul, 2016 18:14 IST|Sakshi

కేససముద్రం (వరంగల్ జిల్లా) : కేససముద్రం మండలం ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్సు రైలు కిందపడి అలివేలు(21) అనే వివాహిత తన రెండు సంవత్సరాల కుమారుడు కౌశిక్‌తో సహా ఆత్మహత్య చేసుకుంది. రాము అనే వ్యక్తిని అలివేలు ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లైన తర్వాత కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో మనస్తాపం చెందిన అలివేలు కుమారుడితో సహా రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు